ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా చందానగర్ స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. చందానగర్ లో గాంధీ విగ్రహం నుండి మొదలై భెల్ సర్కిల్, గంగారం ఆర్ఎస్ బ్రదర్స్, మంజీరా రోడ్డు, రాయల్ ఇండియా సర్కిల్ మీదుగా తిరిగి గాంధీ విగ్రహం వరకు మొత్తం 6 కి.మీలు ర్యాలీ కొనసాగింది. చిరు వ్యాపారులు జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తించారు.

What is your opinion?