ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా హర్ ఘర్ పే తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ చేశారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులు, వాకర్స్, సీనియర్ సిటిజెన్స్ కు త్రివర్ణ పతాకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర అమృతోత్సవాలలో ప్రతీ భారతీయుడు విధిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

What is your opinion?